Wednesday, February 12, 2014

ఒకటవ అధ్యాయం : అర్జున విషాద యోగము :

ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి బలాల,యోధుల గురించి పన్నిన, పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు.
అప్పుడు కౌరవులబలం,వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు.
యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి….. అప్పుడు అర్జునుడు, కృష్ణా!అందరు మనవాళ్ళే,వారిలో కొందరు పుజ్యనీయులు.వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? కావునా, నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు. వారు నన్నుచంపినా నేను మాత్రం వారిని చంపను. అని ధనుర్భాణములను క్రింద వదిలివేసి దుఃఖించసాగాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు..... ఓ అర్జునా! పామరులకు కలిగే, స్వర్గ ప్రాప్తి ఇవ్వనిది, అపకీర్తి కలుగచేసే ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది?

కావున ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా! తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్దము చేయము.

No comments:

Post a Comment