Wednesday, February 12, 2014

ఎనిమిదవ అధ్యాయం : అక్షరపరబ్రహ్మయోగః

అర్జునుడు పలికెను ఓ పురుషోత్తమా ! బ్రహ్మ అనగా ఏమి? అధ్యాత్మము అనగానేమి? కర్మ అనగా నేమి ? అధిభూతము అని దేనికి పేరు ? అధిదైవము అని దేనిని అందురు. ఓ మధుసూధనా! అధియజ్ఞము అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును నిగ్రహముచేసిన యోగులు నిన్నెట్లు తెలిసికోనగలరు ? (8:1,2)
శ్రీభగవానుడు పలికెను బ్రహమనగా సర్వశ్రేష్టుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా బందనాలైన జీవము ఆత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమొనర్చి, వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణములైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మమనుబడుచున్నది. (8:౩)
ఓ అర్జునా! ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నియు అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము దేహధారులలో శ్రేష్టుడైన ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. (8:4)
ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే నన్నే పొందును. ఇందేమాత్రము గూడ సంశయం వలదు (8:5)
కౌంతేయ ! మనుష్యుడు అవసానదశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపము పొందుచున్నాడు. (8:6)
కావునా ఓ అర్జునా! నీవు సదా సర్వదా నన్నే స్మరించు చుండుము. యుద్దమున గూడ చేయుము. నీ బుద్దిని మనస్సును నాయందే నిల్పియున్నచో నిజముగా నన్నే పొందెదవు. (8:7)
మనస్సునందు వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధనచేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. (8:8)
సర్వజ్ఞ్నుడును, సనాతనుడును, అందరిని శాసించువాడును, అణువు కంటెను సుక్ష్మమైనవాడును, సర్వప్రాణులను పోషించు వాడును, అచింత్య రూపుడును, సూర్యునివలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమేశ్వరుని స్మరించు వాడగు అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటి మధ్యమున ప్రాణములను స్తిరముగా నిలిపి, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యరూపుడును, పరమపురుషుడును, అయిన పరమాత్మనే చేరును. (8:9,10)
వేదవిదులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు.ఆశక్తి రహితులై, యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేసింతురు. ఆ పరమపదమును కొరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును. (8:11)
సర్వెంద్రియాలను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వార ప్రాణములను సహస్రారమునందు స్థిరమొనర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్ధస్వరుపుడను, నిర్గునబ్రహ్మను ఐన నన్ను చింతించుచు దేహత్యాగమొనర్చువాడు మోక్షమును పొందుచున్నాడు. (8:12,13)
పార్థా! నిత్యము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి నేను సులభముగా లభింతును. (8:14)
పరమసిద్దిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన, క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందరు.  (8:15)
అర్జునా! బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములును పునరావ్రుత్తములు. కనుక నన్ను చేరినవానికి పునర్జన్మ లేదు. (8:16)
వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రియనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు.చరాచర ప్రాణులన్నియు బ్రహ్మయొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తమునుండి ఉత్పన్నములగును. మరల బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. (8:17,18)
పార్థా! ఈ ప్రాణి సముదాయము ప్రక్రుతివశమున మాటిమాటి కిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. మరల పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును. ఆ అవ్యక్తముకంటెను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అని, పరమపదము అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరంధామమును చేరిన (మోక్షమును పొందిన) వారు మాత్రం మరల జన్మించరు. (8:19-21)
ఓ పార్థా! సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యందె అంతర్గములై యున్నవి. ఆ పరమాత్మచేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై వున్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వార మాత్రమే లభ్యముకాగలడు. (8:22)

యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. (8:28)

No comments:

Post a Comment