శ్రీ భగవానుడు పలికెను – కర్మఫలమును ఆశ్రింపక కర్తవ్యకర్మలను
ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలం అగ్ని కార్యములను
త్యజించినంత మాత్రమున సన్యాసియుకాడు. (6:1)
ఓ అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ
మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు. (6:2)
యోగరూడస్తితిని
పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామకర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగరూడుడైన
పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. (6:౩)
ఇంద్రియభోగములయందు,
కర్మలయందును ఆసక్తినుంచక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగరూడుడనబడును.
(6:4)
మనుజులు
ఈ సంసారసాగరము నుండి తమకు తామే ఉద్దరించు కొనవలెను. తమకుతామే అధోగతిపాలుకారాదు.
లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. (6:5)
ఎవరు తన
మనస్సును జయించునో అట్టి వాని మనస్సు బంధువులా ఉపకారిలా ఉండును. మనస్సును
జయింపనిచో అది శత్రువై అపకారము చేయును. (6:6)
శీతోష్ణములు,
సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా
వుండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమందు పరమాత్మ చక్కగా స్థితుడై యుండును.
(6:7)
యోగియొక్క
అంతఃకరణము నందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను
పూర్తిగా వశపరచుకొనిన వాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును.
(6:8)
సుహ్రుదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్తులయందును,
ద్వేషింపదగిన వారియందును, బందువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును, సమబుద్ది కలియుండువాడు మిక్కిలి
శ్రేష్టుడు. (6:9)
శరీరేంద్రియమనస్సులను
స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, వ్రతుడు అయిన యోగి ఒంటరి ప్రదేశమున కూర్చొని, నిరంతరం
అత్మయందే ధ్యాననిష్టయందుండవలెను. (6:10)
చిత్తెంద్రియవ్యాపారములను
వశము నందుంచుకొని, ఏకాగ్రతగల మనస్సుతో తననాసికాగ్రభాగమునందే దృష్టిని నిలిపి అంతఃకరణశుద్దికై యోగాభ్యసమును సాధనచేయవలెను.
(6:12,13)
ధ్యానయోగి
ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు, మనోనిగ్రహముతో నాయందు
చిత్తము గలవాడై, నన్నే పరమ గతిగ నమ్మి నిశ్చలుడైయుండవలెను. (6:14)
మనోనిగ్రహశాలియైన
యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగ లగ్నమొనర్చి,
నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందుచున్నాడు. (6:15)
మితాహారము,
కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్రగల మనుజునకు ఆత్మసంయమ యోగము లభ్యము.
(6:17)
చిత్తమును
పూర్తిగా వశమునందుంచుకొని, దానిని అత్మయందే స్థిరముగా నిల్చినపుడు పురుషుడు
సర్వభోగములయందు స్ప్రుహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడగుచున్నాడు. (6:18)
గాలిలేనిచోట
పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన
వాని చిత్తము నిశ్చలముగా నుండును. (6:19)
ధ్యానయోగాసాధనచే
నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన
సూక్ష్మ బుద్దితో, ఆ భగవానుని సాక్షాత్కరింప జేసికొని, యోగి ఆ పరమాత్మయందే
సంతుస్టుడగుచున్నాడు. (6:20)
బ్రహ్మానందానుభవము
ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సుక్ష్మబుద్ది ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ
బ్రహ్మానందము అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వస్వరూపమునుండి ఏ
మాత్రము చలింపడు. (6:21)
పరమాత్మ
ప్రాప్తిరూపలాభములు పొందినవాడు, ఏ ఇతర లాభములను గూడ దానికంటె అధికమైన దానినిగా
తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవదుఃఖ ములును
చలింపజేయజాలవు. (6:22)
దుఃఖరూపసంసారబంధముల
నుండి విముక్తిని కలిగించు ఈ భాగవత్సాక్షాత్కారరూపస్థితిని యోగము అని తెలియవలెను.
అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరిత మైన విసుగులేని చిత్తముతో నిశ్చయముగా
అభ్యాసము చేయవలెను. (6:23)
సంకల్పమువలన
కలిగిన కోరికలన్నింటిని నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ
మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. (6:24)
క్రమక్రమముగా
సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్దిబలముతో మనస్సును ఆత్మయందు స్థిరమొనర్చి,
పరమాత్మను తప్ప మరీ ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతనచేయరాదు . (6:25)
సహజముగా
నిలకడలేని చంచలమైన మనస్సును ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించు
చుండును. అట్టి మనస్సును ఆయా విషయములనుండి పదే పదే మరల్చి, దానిని అత్మయందే
స్థిరముగా నిలుపవలెను. (6:26)
ప్రశాంతమైన
మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక
కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి
బ్రహ్మానందమును పొందుచున్నాడు. (6:27)
పాపరహితుడైన
ఆ యోగి పుర్వోక్తరీతిగా నిరంతరము పరమాత్మయందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మ పరమాత్మ
ప్రాప్తిరూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. (6:28)
సర్వవ్యాప్తమైన
అనంతచైతన్యమునందు ఏకీభావస్థితిరూప యోగ యుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని
సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్తితమైయున్నట్లుగాను,
ప్రాణులన్నింటిలోను తన ఆత్మనే దర్శించుచున్నాడు. (6:29)
భగవంతునియందు
ఏకీభావస్తితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును.
అట్టి యోగి సర్వధా సర్వవ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించు
చుండును. (6:31)
ఓ అర్జునా!
సర్వప్రాణులను తనతో సమానముగా చూచు వాడును, సుఖమునుగాని, దుఃఖమునుగాని సమముగా
సమానముగా చూచువాడును ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖాములుగా భావించుచుండును అయిన
యోగి పరమశ్రేష్టుడు అని చెప్పబడుచున్నాడు. (6:32)
అర్జునుడు...
ఓ కృష్ణా! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మదించు స్వభావము గలది. మిక్కిలి
బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట అంటే గాలిని ఆపుటనువలె మిక్కిలి దుష్కరమని
నాకు తోచు చున్నది. (6:34)
ఓ అర్జునా!
నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టము(దుస్సాధ్యమే).
అయిన దానిని అభ్యాసవైరాగ్యముల ద్వార మనసును
నిరోధింపవచ్చును. (6:35)
మనస్సును
వశపరచుకొనని పురుషునకు యోగసిద్ది కలుగుట కష్టము. కాని మనస్సు వశమునందున్న
ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వార సహజముగా యోగసిద్దిని పొందుట సాధ్యమే అని నా
అభిప్రాయము. (6:36)
ఓ కృష్ణా!
యోగమునందు శ్రద్ధతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసానదశలో మనస్సు
చలించి, అత్మసాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతియేమగును? (6:37)
ఓ పార్దా!
అట్టి పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అదోగాతిపాలుకాడు. ఆత్మోద్దారణమునకు
అనగా భగవత్ప్రాప్తికోరకై కర్తవ్య కర్మలను ఆచరించు వాడేవ్వడును దుర్గతి పాలుగాడు
గదా! (6:4౦)
అర్జునా!
యోగభ్రస్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది – ఉత్తమ
లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన తర్వాత పవిత్రులైన
సంపన్నుల గృహమున జన్మించును. (6:41)
లేనిచో
విరాగియైన పురుషుడు ఆ పుణ్య లోకములకు పోకుండగానే జ్ఞానుకైన యోగులకుటుంబంలోనే
జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము గదా.
(6:42)
అచట యోగి ఆ
కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా
సమబుద్దిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందనా! ఆ బుద్ధి సంయోగ
ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్దించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన
చేయు చున్నాడు. (6:4౩)
కాని,
ప్రయత్నపుర్వకముగా యోగసాధనచేయు యోగి అనేక జన్మలసంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే
సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తక్షణమే పరమ పదమును పొందును. (6:45)
ధ్యాన
యోగి తాపసులకంటేను, జ్ఞానులకంటేను శ్రేష్ఠుడు . సకామకర్మలాచరించువారికంటేను
శ్రేష్టుడని భావింపబడును. (6:46)
యోగులందరిలో
శ్రద్దాలువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తివిస్వాసములతో నిశ్చలమైన,
ధ్రుడమైన అనన్య భావముతో నాయందే స్తిరమైయున్న మనోబుద్దిరూప అంతఃకరణమును గలిగి,
నిరంతరము నన్నే భజించువాడు సమస్త యోగులలో ఉత్తముడు . (6:47).
No comments:
Post a Comment