శ్రీ కృష్ణ
భగవానుడు పలికెను – ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే
ముఖ్యశాఖగా, వేదములే ఆకులుగా గల ఈ సంసారరూప – అశ్వత్ధవృక్షము
శాశ్వతమైనది. ఏ సంసార వృక్షతత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను
తెలిసిన వాడు. (15:1)
ఈ సంసార
వృక్షమును త్రిగుణములనెడి జలములు తడుపుచుండెను. ఆ జలములచే వృద్దిపొందు శాఖలే
దేవమనుష్యతిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్ళు విషయభోగములు. ఈ శాఖముల
చిగుళ్ళు సర్వత్ర వ్యాపించి యున్నవి. మనుజులను కర్మానుసారముగా బందించు అహంకార
మమకార వాసనలనేడి వేర్లు, ఊడలు అన్ని లోకములలోనూ క్రింద, పైన వ్యాపించి ఉన్నవి. (15:2)
ఈ సంసార
వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము గాదు. ఇది
ఆదియు, అంటాము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారము కారవసనారూపములైన ధృడమైన
వేర్లు, ఊడలు గల ఈ సంసార రూప – అశ్వత్ధవృక్షమును సునిశితమైన వైరాగ్యమనెడి
శస్త్రముతో ఖండించి... అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ
అన్వేషింపవలెను. ఈ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు మరలరారు. అట్టి
పరమేశ్వరునినుండియే ఈ సనాతనమైన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి
పరమాత్ముని శరణుపొంది, ధ్రుడ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని సదా మనన, నిదిధ్యాసాదులు
చేయవలెను. (15:౩,4)
దురభిమానమును,
మోహమును వదిలిపెట్టినవారు, ఆసక్తియను దోషమును జయించినవారును,
ప్రాపంచికవాంచలవదిలినవారు పరమాత్మ స్వరూపము నందు నిత్యము చలించువారు,
సుఖదుఃఖాదిద్వంద్వందముల నుండి విముక్తులైనవారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ
పరమపదమును పొందుదురు. (15:5)
స్వయంప్రకాశస్వరూపమైన
ఆ పరమాత్మను సూర్యుడు గాని, చంద్రుడుగాని, అగ్నిగాని ప్రకశింపజేయజాలరు. అట్టి పునరావృత్తి
రహితమైనదే మోక్షపధము, పరంధామము. అట్టి ఉత్తమ పథమునకు చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు.
(15:6)
ఈ
దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రక్రుతి యందు స్థితములైన మనసు
ఇంద్రియములను శబ్దాది విషయములద్వార తనవైపు ఆకర్షించును. (15:7)
వాయువు
వాసనలను ఒకచోటినుండి మరొకచోటికి తీసికొని పోయినట్లుగా దేహాదులకు స్వామియైన
(ఆత్మను) జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సును ఇంద్రియములను గ్రహించి,
వాటితో గూడ మరొక శరీరమును పొందును. (15:8)
ఈ జీవాత్మ
పంచేంద్రి యములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాది విషయములను అనుభవించును. (15:9)
జీవాత్మ
శరీరమును త్యజించినపుడు, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయభోగములను
అనుభవించు చున్నప్పుడును, త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు
తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వరూపమును
తెలిసికొనుచున్నారు. (15:10)
అంతః
కరణశుద్దిగలయోగులు తమహృదయముల యందున్న ఈ అత్మతత్వమును ప్రయత్నించి తెలిసికొనగలరు.
కానీ అంతఃకరణశుద్దిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొనజాలరు.
(15;11)
సర్వజగత్తును
ప్రకాశింపజేయు సూర్యునితేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా
తేజస్సేయని తెలిసికొనుము. (15:12)
దేహులందు
జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము
చేయుచున్నాను. (15:14)
అన్ని
ప్రాణుల హృదయములలో అంతర్యామిగా వున్న వాడను నేనే. ననుండియే స్మృతి, జ్ఞానము, మరపు
కలుగుచున్నవి. వేదముల ద్వార తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను
గూడ నేనే. (15:15)
ఈ
లోకమునందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశము లేనివాడు) అని పురుషులు రెండు
విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు. జీవాత్మ (అంటే ఆత్మ+కర్మలు)
నాశరహితుడు. (15:16)
(జీవాత్మ
ఎప్పుడైతే అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలను తొలగించుకుంటుందో అప్పుడు పరిపూర్ణమైన
ఆత్మ, పరమాత్మ సాగరంలో విలీనమవుతుంది)
పై
ఇద్దరికంటేను ఉత్తముడైన పురుషుడు
వేరైనవాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు మూడులోకములయందును
ప్రవేశించి అందరిని భరించి పోషించుచున్నాడు. (15:17)
నశ్వరమగు
క్షేత్రము (శరీరము) కంటెను నేను సర్వదా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను.
కనుక ఈ జగత్తునందును, వేదముల యందును పురుశోత్తముడనని ప్రసిద్దికెక్కితిని. (15:18)
ఓ అర్జునా!
జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు
వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. (15:19)
No comments:
Post a Comment